ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ఆడియో వేడుక అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తుండటం తో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించారు. పైగా ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా పిలిచారు.
కానీ నిన్న హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురిసింది అంతేకాదు ఈరోజు ,రేపు కూడా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భరత్ బహిరంగ సభ సజావుగా సాగుతుందా అన్న అనుమానం నెలకొంది. వరుణుడు సహకరిస్తే భరత్ బహిరంగ సభ విజయవంతం అవుతుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు.
- Advertisement -