ప్రభాస్ – పూజా హగ్దే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మార్చి 11 న రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసింది. రీసెంట్ గా `ఈ రాతలే..` అంటూ సాగే లిరికల్ వీడియోని వదిలిన మేకర్స్ మరో ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారట.
ఇప్పటికే కట్ చేసిన ట్రైలర్ ని మార్చి 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతున్నప్పటికీ ప్రమోషన్ ను భారీ ఎత్తున చేయడం లేదనే విమర్శలు వస్తున్న తరుణంలో ప్రెస్ ఇంటరాక్షన్ లు ఇంటర్వ్యూలు.. స్పెషల్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారట. ప్రచారంలో భాగంగా ఓ భారీ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఒక జ్యోతిష్య నిపుణుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం..అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం తో సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు నిర్మాతలు.