Homeటాప్ స్టోరీస్రాజాంలో రాధేశ్యామ్ థియేటర్ సీజ్ చేసిన అధికారులు

రాజాంలో రాధేశ్యామ్ థియేటర్ సీజ్ చేసిన అధికారులు

radhe shyam theater Siege in rajam
radhe shyam theater Siege in rajam

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌ , ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ వద్ద సందడి మొదలైంది.

ఇక ఏపీలో అయితే ప్రభాస్ అభిమానులు పండగ వాతావరణంలో ఉన్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో రాధేశ్యామ్ ప్రదర్శితమవుతోన్న అప్సర థియేటర్‌ను అధికారులు సీజ్‌ చేసి అభిమానులను నిరాశకు గురి చేసారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్‌ షో ప్రదర్శించారని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. మరోపక్క తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని మహిళా ప్రేక్షకుల కోసం రాధేశ్యామ్ స్పెషల్ షో ప్రదర్శించారు. వీపీసీ థియేటర్లలోని ఒక స్ర్కీన ను కేవలం మహిళలకే కేటాయించి షో వేశారు. ఈ సందర్భంగా మహిళలు ఈలలు, కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All