Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ థియేటర్స్ లలో ఆస్ట్రాలజీ కౌంటర్స్ ఓపెన్ ..

రాధే శ్యామ్ థియేటర్స్ లలో ఆస్ట్రాలజీ కౌంటర్స్ ఓపెన్ ..

దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. విధికి – ప్రేమకు మధ్య సాగే సమరం నేపథ్యంలో సరికొత్త కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. సినిమాలో హీరో ప్రభాస్ పామిస్ట్ గా నటించారు. జ్యోతిష్యం హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబందించి హీరో పాత్ర ప్రధాన హైలైట్ గా నిలుస్తుందట. రాజులు యువరాజులు.. ప్రెసిడెంట్స్.. ప్రైమ్ మినిస్టర్ ల వంటి పెద్ద పెద్ద వారికి సలహాలిచ్చే వ్యక్తిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. దీంతో సినిమా ఫై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా ను మార్చి 11 న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు.

- Advertisement -

ఇక సినిమా రిలీజ్ కు రెండు వారాలే ఉండడం తో ప్రమోషన్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రాధే శ్యామ్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రత్యేక కౌంటర్లని ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో హీరో పామిస్ట్ (హస్తసాముద్రికా నిపుణుడు)గా నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో `రాధేశ్యామ్` రిలీక్ కానున్న థియేటర్లలో ఆస్ట్రాలజీ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి అందులో ఓ హస్తసాముద్రికా నిపుణుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఈ కౌంటర్లని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగించి సినిమా ప్రమోషన్స్ కోసం `రాధేశ్యామ్` టీమ్ చేస్తున్న ఈ వినూత్న ప్రమోషన్స్ ని చూసి ఆశ్చర్య పోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All