పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించగా, పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. పలు భాషల్లో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మొదటి రెండు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తర్వాతి రోజు నుండి కలెక్షన్లు భారీగా తగ్గడం మొదలయ్యింది. ఇక సోమవారం మాత్రం దారుణమైన వసూళ్లు రాబట్టడం తో చిత్ర మేకర్స్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాల్గో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 95 లక్షలు
సీడెడ్లో రూ. 30 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు
ఈస్ట్లో రూ. 15 లక్షలు
వెస్ట్లో రూ. 13 లక్షలు
గుంటూరులో రూ. 14 లక్షలు
కృష్ణాలో రూ. 12 లక్షలు
నెల్లూరులో రూ. 10 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.11 కోట్లు షేర్, రూ. 3.45 కోట్లు గ్రాస్ రాబట్టింది. మొత్తం నాల్గు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రూ. 50.50 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమా.. 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.31 కోట్లు వసూలు చేసింది. అంటే సినిమా సక్సెస్ అవ్వాలి అంటే 128.69 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత లెక్కలు చూస్తే ఆ మొత్తం రావడం కష్టమే అని తెలుస్తుంది.