ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం ఐకాన్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుండి మొదలుకానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. ముందుగా హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్ ను పూర్తి చేసి తర్వాత గోవాలో ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు సుకుమార్.
ముందుగా పుష్ప చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేద్దాం అని భావించారు. కానీ షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. మరో 40 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేద్దామని నిర్ణయించిన విషయం తెల్సిందే.
ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్ర రిలీజ్ డేట్ పై వచ్చే నెలలో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.