వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జన గణ మన`. దేశ భక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరింత పవర్ఫుల్గా తెరపైకి తీసుకురావాలని, తనదైన మార్కు మేకింగ్తో ఈ మూవీని చేయాలని దర్శకుడు పూరిజగన్నాథ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని మహేష్తో చేయాలని ప్లాన్ చేశారు పూరి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు.
మహేష్ ఆసక్తి చూపించకపోవడం వల్లే ఈ మూవీ ఆగిపోయిందని వార్తలు షికారు చేశాయి. పూరి కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా వెల్లడించారు కూడా. పూరి జగన్నాథ్కు వరుస ఫ్లాపులు రావడం వల్లే మహేష్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆలోచించాడని, ఆ కారణంగానే ఆయన ఈ చిత్రాన్ని చేయలేకపోయారని ఇన్ సైడ్ టాక్.
తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ సోమవారం పూరిని మై ఫేవరేట్ డైరెక్టర్ అంటూ విష్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో మరో సారి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం వుందంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న మహేష్ ఆ తరువాత మరో రెండు ప్రాజెక్ట్లని పూర్తి చేయాలనుకుంటున్నాడట. ఆ తరువాతే రాజమౌళి ప్రాజెక్ట్ కి డేట్స్ కేటాయిస్తారని టాక్. రాజమౌళి సినిమా కు ముందే `జన గణ మన` పట్టాలెక్కినా ఆశ్చర్యం లేదని వార్లు వినిపిస్తున్నాయి.