Homeటాప్ స్టోరీస్దాసరి ఇంట్లో గొడవలు రోడ్డున పడ్డాయ్

దాసరి ఇంట్లో గొడవలు రోడ్డున పడ్డాయ్

property dispute in dasari narayanarao familyదర్శకుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఆస్థుల కోసం గొడవలు మొదలయ్యాయి . దాసరి పెద్ద కొడుకు భార్య సుశీల మళ్ళీ ఆస్థుల కోసం రోడ్డెక్కింది . దాసరి నారాయణరావు ఉన్నప్పుడే పలుమార్లు గొడవలు జరిగాయి అయితే అప్పట్లో సెటిల్మెంట్ చేయలేదు కానీ హామీ ఇచ్చాడట కానీ ఇప్పుడు ఆ పెద్దాయనే లేడు దాంతో దాసరికి డబ్బులు ఇవ్వాల్సినవాళ్లు ఆ ఇంటి ముఖం చూడటం లేదు , పైగా దాసరి సొమ్ము ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు మిన్నకుండి పోవడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి .

దాసరికి ఇద్దరు కొడుకులు ప్రభు , అరుణ్ కుమార్ లు కాగా పెద్దబ్బాయి ప్రభు మొదటి భార్య ఈ సుశీల . అయితే దాసరి ఉన్న సమయంలోనే పలుమార్లు గొడవలు అయ్యాయి , ఇక ఇప్పుడేమో దాసరి లేడు కాబట్టి తక్షణం నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ రోడ్డెక్కింది . విషయం పెద్దది కావడంతో , రోడ్డు మీదకు చేరడంతో లీగల్ గా చూసుకోండని పోలీసులు ఇరు వర్గాలకు సూచనలు చేశారట . ప్రస్తుతం దాసరి చిన్న కొడుకు అరుణ్ అజమాయిషీ లో దాసరి ఆస్థులు ఉన్నాయి . మరి సుశీల కు వాటా ఇస్తారా ? లేక ఈ వివాదం ఇలాగే సాగుతుందా ? దాసరి సన్నిహితులు ఎవరైనా ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తారా చూడాలి .

- Advertisement -

English Title: property dispute in dasari narayanarao family

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All