Homeటాప్ స్టోరీస్నిర్మాత కొడుకు దుర్మరణం

నిర్మాత కొడుకు దుర్మరణం

producer s. gopal reddy son bhargav reddy suspicious deathనటసింహం నందమూరి బాలకృష్ణ తో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ . గోపాల్ రెడ్డి  తనయుడు ” భార్గవ్ రెడ్డి ” దుర్మరణం పాలయ్యాడు . ఎస్ . గోపాల్ రెడ్డి 2008 లో చనిపోగా అప్పటి నుండి చిత్ర రంగానికి దూరంగా ఉంది ఆ కుటుంబం . భార్గవ్ రెడ్డి మానసిక వికలాంగుడు దాంతో అతడ్ని అల్లారుముద్దుగా పెంచాడు ఎస్ . గోపాల్ రెడ్డి . నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి గ్రామ శివారున గల సముద్రపు ఒడ్డుకు భార్గవ్ రెడ్డి మృతదేహం కొట్టుకు రావడంతో భార్గవ్ ది ఆత్మహత్యా ? లేక హత్యా నా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

భార్గవ్ రెడ్డి చనిపోయాడని తెలియడంతో ఎస్ . గోపాల్ రెడ్డి తో అనుబంధం ఉన్నవాళ్లు షాక్ కి లోనయ్యారు . గోపాల్ రెడ్డి చనిపోవడం , భారీ బ్లాక్ బస్టర్ లను నిర్మించినప్పటికీ కేవలం రెండు సినిమాల వల్ల ఆర్ధికంగా చితికి పోవడంతో గోపాల్ రెడ్డి కుటుంబం అతలాకుతలం అయ్యింది . భార్గవ్ మృతికి కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All