ధనుష్ నటించిన `అసురన్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో హీరో వెంకటేష్కి జోడీగా మంజు వారియర్ పాత్రలో శ్రియ నటిస్తారని ప్రచారం జరిగింది.
మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం శ్రియ కాకుండా ఆ పాత్రలో అవార్డు విన్నంగ్ నటి ప్రియమణి నటించనున్నట్టు తెలుస్తోంది. మంజు వారియర్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది కావడంతో ఆ పాత్రలో అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి అయితేనే బాగుంటుందని సురేష్బాబు భావిస్తున్నారని, ఆ కారణంగానే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరో పక్క లొకేషన్స్ని ఫైనల్ చేసే పనిలో చిత్ర బృందం బిజీగా వుంది. అన్నీ ఫైనల్ అయితే వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు కమ్యునిటీల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వెట్రిమారన్ అత్యంత సహజత్వంగా తెరకెక్కించారు. అదే తరహాలో తెలుగులోనూ నిర్మించాలని ప్లాన్లు జరుగుతున్నాయి.