అత్యుత్సాహం ఎప్పటికైనా ప్రమాదకరమే. దీని కారణంగా ఓ హీరో మరో దేశంలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. ఇటీవల వరుస విజయాలతో మాంచి జోరుమీదున్న పృథ్విరాజ్ ఓ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ తరహాలోనే టీమ్ అందరినీ వెంటేసుకుని `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు.
ఇదే సమయంలో కరోనా కక్కసి కరాళ నృత్యం చేస్తోంది. ఈ విషయం తెలిసినా టీమ్ మాత్రం ఇండియా తిరిగి రావడానికి ఇష్టపడలేదు. కీలక సన్నివేశాల్ని పూర్తి చేయాలని టీమ్ అంతా అక్కడే వుంది. ఈ లోగా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ని ప్రకటించాయి. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు.
బ్లెస్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 57 మందితో షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర టీమ్ని ఇదివరకే జోర్డన్ పోలీసులు హెచ్చరించారట. షూటింగ్ ఆపేయాలని చెప్పినా వినకుండా అక్కడే వున్న పృథ్వీరాజ్ అంటే టీమ్ జోర్డాన్లో ఇరుక్కుపోయింది. దీంతో యూనిట్ సభ్యులు దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారట. ఈ విషయం తెలిసిన మలయాళీ చిత్ర వర్గాలు పృథ్విరాజ్ అండ్ టీమ్ని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట.