మా ఎలక్షన్స్ వేడి ఇంకా చల్లారినట్టు లేదు. అక్టోబర్ 10న ఎలక్షన్స్ జరిగాయి.. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయినా సరే ఓడిన ప్రకాష్ రాజ్ శాంతించట్లేదు. తన ప్యానల్ లో గెలిచిన వారందరిచేత రాజీనామా చేయించిన ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా మా ఎలక్షన్స్ టైం లో జరిగిన గొడవలపై ఫోకస్ పెడుతూ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని అంటున్నారు. మంచు విష్ణు ఫుటేజ్ చూసుకోమని చెబుతున్నా ఎక్కడో ఓ చోట ఆ ఫుటేజ్ బయటకు రాకుండా ఉంటే బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మా సభ్యులకు న్యాయం జరిగే వరకు మంచు విష్ణుని.. అతని ప్యానల్ సభ్యులని వదిలిపెట్టనని అన్నారు. చూస్తుంటే ఈ రెండేళ్లు ప్రకాష్ రాజ్ భయం తో అయినా సరే మంచు విష్ణు తను మేనిఫెస్టోలో చెప్పిన పనులు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ ముగిసినా తనకు ఓటేసిన సభ్యుల కోసం పోరాడుతా.. నిలదీస్తా.. కడిగేస్తా అంటున్నారు ప్రకాష్ రాజ్. మొత్తానికి గెలిచిన మంచు విష్ణు కన్నా.. ఓడిన ప్రకాష్ రాజ్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారని అర్ధమవుతుంది.