వెండితెరపై తనదైన విలక్షణ నటనతో విలనిజానికి సరికొత్త సొబగులద్దారు ప్రకాష్ రాజ్. వెండి తెరపై విలన్ గా తనదైన నటనను ప్రదర్శించి విలక్షణావనటుడిగా పేరు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా సామాజిక సమస్యలపై గళం విప్పుతున్నారు.
జస్ట్ అస్కింగ్ అంటూ ప్రభుత్వాలను రాజకీయనాయకులను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ కిమకాం మార్చిన ప్రకాష్ రాజ్ వలస కూలీలకు తనవంతు సాయాన్ని అందించారు.
లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకన ఊళ్లకు పయనం అయినా విషయం తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందిస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా కేంద్ర ప్రభుత్వంపై స్పందించిన తీరు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రియమైన మినిస్టర్ ఆత్మనిర్భర్ .. మీ దేశవ్యాప్తంగా జరిగే ప్రతి ఎన్నికల సమావేశానికి బస్సులు మరియు ట్రక్కులలో ఆహారం మరియు డబ్బుతో లక్షలాది మందిని తీసుకెళ్లగల నెట్వర్క్ మీకు ఉంది. దానిలో సగం సేవ చేయమని చెబితే వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేవారు జస్ట్ అస్కింగ్’. అంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఈ ప్రశ్నకు అధికార పక్షం బదులిస్తుందా? అని నెటిజన్స్ అంటున్నారు.
- Advertisement -