Homeటాప్ స్టోరీస్తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ కు భారీ షాక్..ఫ్యాన్స్ గగ్గోలు

తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ కు భారీ షాక్..ఫ్యాన్స్ గగ్గోలు

రాధే శ్యామ్..రాధే శ్యామ్ ఇప్పుడు ఎక్కడ విన్న..ఎక్కడ చూసిన ఇదే మేనియా. బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో గోల్డెన్ లెగ్ పూజా హగ్దే హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ & గోపి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మరికొద్ది సేపట్లో థియేటర్స్ లలో సందడి చేయబోతుంది.

- Advertisement -

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ చిత్రాన్ని తక్కువ థియేటర్స్ లలో రిలీజ్ చేయడం ఇప్పుడు అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. పుష్ప , అఖండ , భీమ్లా నాయక్ వంటి చిత్రాలను దాదాపు వెయ్యి థియేటర్స్ లలో రిలీజ్ అవ్వగా..ప్రభాస్ చిత్రం మాత్రం 860 థియేటర్లలో విడుదల చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కరోనా ఆంక్షలు లేవు , టికెట్ ధరల సమస్య లేదు , పోనీ మరో సినిమా వస్తుందంటే అది లేదు..ఇలాంటి సమయంలో తక్కువ థియేటర్స్ లలో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అని అభిమానులు అడుగుతున్నారు. థియేటర్ల సంఖ్యను అమాంతం పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మేకర్స్ థియేటర్స్ ను పెంచుతారో..లేక అంతే అంటారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All