Homeటాప్ స్టోరీస్ప‌దివేల‌మంది ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్‌తో...!

ప‌దివేల‌మంది ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్‌తో…!

 ప‌దివేల‌మంది ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్‌తో...!
ప‌దివేల‌మంది ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్‌తో…!

విజ‌య్‌ధ‌ర‌న్‌, రాశిసింగ్‌, అక్ష‌త‌, సొనావానే హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్న చిత్రం `పోస్ట‌ర్‌`. శ్రీ సాయి సుష్పా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై టి. మ‌హిపాల్‌రెడ్డి (టిఎమ్ ఆర్‌) ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాట‌ల్ని చిత్ర బృందం ఇప్ప‌టికే రిలీజ్ చేసింది. అత్య‌ధిక వ్యూస్ రాబ‌ట్టాయి. తాజాగా ఈ చిత్రంలోని మ‌రో పాట‌ని గుంటూరు లోని వివిఐటీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో రిలీజ్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ పాట‌ని ప‌దివేల మంది ఇంజ‌నీరింగ్ విద్యార్థులు విడుద‌ల చేయ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

`నువ్వంటే ఎవ‌రంట మిత్ర‌మా…` అంటూ సాగే ఈ మోటివేష‌న్ సాంగ్ స్టూడెంట్స్‌ని అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ద‌ర్శ‌కుడు మ‌హిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ` ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిర రెండు సింగిల్స్‌, టీజ‌ర్‌ని రిలీజ్ చేశాం. సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి. తాజాగా గుంటూరులోని వివిఐటి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో రిలీజ్ చేసిన `నువ్వంటే ఎవ‌రంట మిత్ర‌మా…` అంటూ సాగే పాటకు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. యువ‌త‌ని ఉత్తేజ‌ప‌రిచి వారిలో స్ఫూర్తిని నింపేలా ర‌చ‌యిత పెద్దాడ మూర్తి అద్భుతంగా రాశారు. ఈ పాట‌కు శాండీ అద్దంకి చ‌క్క‌ని ట్యూన్స్ అందించారు అని పేర్కొన్నారు.

- Advertisement -

స‌మ‌స్య‌లు వ‌స్తే పారిపోవ‌డ‌మో లేదా కృంగిపోవ‌డ‌మో కాకుండా ధైర్యంగా నిల‌బ‌డాల‌ని, స‌మస్య‌ల్ని ఎదుర్కొని పోస్ట‌ర్ అంటించ‌డానికి కూడా ప‌నికిరాని ఓ యువ‌కుడు అదే పోస్ట‌ర్ మీద‌రి ఎక్కేస్థాయికి ఎలా ఎదిగాడ‌న్న క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సందేశాన్ని మిలితం చేసి క‌మ‌ర్ష‌య‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని మ‌హిపాల్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All