Homeటాప్ స్టోరీస్ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న భార్యాబంధు

ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న భార్యాబంధు

positive response on IPC section bharya bandhuచిన్న చిత్రంగా వచ్చిన ఇపిసి సెక్షన్ భార్యాబంధు చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది . నిన్న దాదాపు 10చిత్రాలు విడుదల కాగా అందులో ఈ భార్యాబంధు కూడా ఒకటి . అయితే ఈ చిత్రం మిగతా చిత్రాలకు భిన్నంగా ఉంది ,నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు , కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఇపిసి సెక్షన్ భార్యబంధు చిత్రం రూపొందడంతో ప్రశంసలు లభిస్తున్నాయి . ఆలూరి క్రియేషన్స్ పతాకంపై శరత్ చంద్ర – నేహా దేశ్ పాండే జంటగా రెట్టాడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించాడు . విజయ్ కూరాకుల సంగీతం అందించాడు .

ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషించడం విశేషం . ప్రేమికుల మధ్య కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య వస్తున్న అపోహలు వాటి ప్రభావం ఎలా పడుతుందో చక్కగా చూపించారు దర్శకులు శ్రీనివాస్ . ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తల మద్య వస్తున్న అపోహలు ఎలాంటివి వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలని చూపించే మంచి ప్రయత్నం చేసారు . ఆమని కీలక పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . అయితే స్క్రిప్ట్ పరంగా దర్శకులు శ్రీనివాస్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది . ఐపిసి సెక్షన్ భార్యాబందు వల్ల కొంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారో చెప్పగలిగారు ఈ చిత్ర బృందం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All