సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని అంటోంది హీరోయిన్ పూజిత పొన్నాడ . రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి లవర్ గా నటించింది ఈ భామ , అయితే ఈ భామకు దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య ఎఫైర్ నడుస్తోందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి . ఆ వార్తలు పూజిత పొన్నాడ చెవిన పడటంతో అబ్బే ! మా ఇద్దరికీ పరిచయమే సరిగ్గా లేదు ఇంకా ఎఫైరా ? అంటూ దీర్ఘాలు తీస్తోంది .
కానీ బయట మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వినిపిస్తోంది . రంగస్థలం చిత్రంతో పాటుగా దర్శకుడు , వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రాల్లో నటించింది . ఇక ఇప్పుడేమో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో కూడా నటిస్తోంది . గతంలో దేవిశ్రీ ప్రసాద్ కు ఛార్మి కి మధ్య లవ్ ఉందని గుసగుసలు వినిపించాయి , నిజం కూడా కానీ ఇద్దరికీ ఎక్కడో చెడింది దాంతో ఛార్మి నేను పెళ్లే చేసుకోను అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది .