ఒక్క హిట్టు పడితే మన స్టార్స్ పారితోషికాలు చుక్కలనంటేస్తాయి అన్నది తెలిసిందే. అదే బ్లాక్ బస్టర్ పడితే వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదు. బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న పూజా హెగ్డే రీసెంట్గా `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచేసింది.
గత ఏడాది కోటి 75 లక్షలు మాత్రమే తీసుకున్న పూజా హెగ్డే ప్రతీ స్టార్ హీరో తనే కావాలనడంతో `అల వైకుంఠపురములో` చిత్రం తరువాత తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచేసింది. తదుపరి చిత్రాలకు ఈ మాత్రం ఇస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ పూజా హెగ్డే నిర్ణయించుకుని తనని సంప్రదించిన దర్శకనిర్మాతలని డిమాండ్ చేసిందంట. దీంతో 3 కోట్లు ఇచ్చుకోలేక చాలా మంది ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారట.
అనూహ్యంగా కరోనా వైరస్ ప్రభలడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని రంగాలు కుదేలైపోయాయి. దీంతో సినీ రంగంలోనూ అనూహ్య మార్పులు మొదలయ్యాయి. తారల పారితోషికాలు తగ్గించడం మొదలైంది. దీని వల్ల పూజా హెగ్డే చాలా ఆఫర్లని, కోట్లల్లో డబ్బుని పోగొట్టుకోవాల్సి వచ్చిందట. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాల్లో నటిస్తోంది.