యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో హీరోయిన్ గా పలువురు హీరోయిన్ లను తీసుకోవాలని అనుకున్నారు కానీ చివరగా పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది . ఈ భామకు తెలుగులో అంతగా సక్సెస్ లు లేవు . ఇప్పటివరకు ఒక లైలా కోసం , ముకుంద , డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాల్లో నటించగా అన్ని సినిమాలు కూడా అనుకున్న రేంజ్ లో ఆడలేదు అయితే దువ్వాడ జగన్నాథం చిత్రంలో మాత్రం రెచ్చిపోయి అందాలను ఆరబోసింది పూజా హెగ్డే .
వచ్చే నెల మార్చిలో ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ ని నిన్న మొన్నటి వరకు ఎంపిక చేయలేదు కానీ తాజాగా మాత్రం పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు ఆ చిత్ర బృందం . తెలుగులో అంతగా కలిసి రాని ఈ భామకు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ లు హిట్ ఇస్తారో చూడాలి .