Homeటాప్ స్టోరీస్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సెట్లో కరోనా భయం

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సెట్లో కరోనా భయం

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సెట్లో కరోనా భయం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సెట్లో కరోనా భయం

అక్కినేని అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సెట్ లో కరోనా భయం అందరినీ కలవరపాటుకు గురి చేసింది.

సెట్లో పూజ హెగ్డే అనారోగ్యం పాలవ్వడమే ఇందుకు కారణం. వరస షూటింగులతో పూజ హెగ్డే చాలా చోట్లకు తిరుగుతోంది. రాధే శ్యామ్ షూటింగ్ ఇటలీలో పూర్తి చేసుకుని వచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ ను పూర్తి చేస్తోంది. అయితే పూజ హెగ్డేను జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా టెస్ట్ చేయించారు. లక్కీగా కరోనా నెగటిక్ అని తేలింది. అయితే ఎందుకైనా మంచిదని ఈ అమ్మడు ముంబైలోని తన ఇంటికి వెళ్ళిపోయింది.

- Advertisement -

వారం తర్వాత మళ్ళీ కరోనా టెస్టు చేయించుకుని తిరిగి సెట్లో అడుగుపెట్టనుంది పూజ. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ క్లైమాక్స్ పోర్షన్స్ జరుగుతున్నాయి. వీటితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All