![అల్లు అర్జున్ హీరోయిన్కు హ్యాకర్స్ దెబ్బ! అల్లు అర్జున్ హీరోయిన్కు హ్యాకర్స్ దెబ్బ!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/05/Pooja-Hegde-instagram-hacked.jpg)
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటి పట్టునే వుంటున్నారు. సినీ తారలు ఇంటి పట్టునే వుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అభిమానులతో టచ్లో వుంటున్నారు. ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లని ఇందుకు వేదికలుగా చేసుకుంటున్నారు. అయితే వాటిని కొంత మందిహ్యాక్ చేస్తూ సెలబ్రిటీలని ఆడుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది.
తాజాగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కుంది. ఇన్స్టా గ్రామ్ ద్వారా తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో వుంటున్న పూజా హెగ్డేకి ఉన్నట్టుండి బుధవారం అర్థ్రరాత్రి హ్యాకర్స్ షాకిచ్చారు. ఆమె ఇన్ స్టా అకౌంట్ని హ్యాక్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పూజా హెగ్డే వెంటనే తన టెక్నికల్ టీమ్ని రంగంలోకి దింపేసింది.
ఈ క్రమంలో తన లకౌంట్ ఎక్కడ చేజారకిపోతుందో నని పూజ తెగ కంగారుపడింద. అయితే ఆమె టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్ కావడంతో హ్యాకర్స్ నుంచి కేవలం గంట వ్యవధిలోనే ఇన్స్టా గ్రామ్ అకౌంట్ని తిరిగి సాధించారట. దీంతో ఊపిరి పీల్చుకున్న పూజా తన టెక్నికల్ టీమ్కి అభినందనలు తెలియజేసింది. తన అకౌంట్ తనకు తిరిగి వచ్చేసిందని, ఎప్పటిలాగే తనని అనుసరించవచ్చిన వెల్లడించింది. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ చిత్రంతో పాటు అఖిల్ చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాల్లో నటిస్తోంది.