కొంత మంది తారలు ఇంటర్వ్యూలలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. కొన్ని లక్షల మంది మనం మాట్లాడేది చూస్తుంటారు కాబట్టి వచ్చే ప్రతీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంత మంది సెలబ్రిటీలు మాత్రం అవేం పట్టించుకోరు. తమకు తోచింది మాట్లాడేస్తుంటారు. తీరా డ్యామేజ్ జరిగాక జాగ్రత్త పడుతుంటారు.
పూజ హెగ్డే ఈ మధ్య ఇలాంటి వివాదాల్లో ఎక్కువగా కనపడుతోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సౌత్ లో నడుము, కాళ్ళు అంటే పడిచస్తారని, అవి చూపిస్తే చాలు నటన కూడా అవసరం లేదనే తరహాలో మాట్లాడి వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ తన ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగే రేంజ్ లో ఉంటాడని, తనతో నటించడం మంచి అనుభూతినిచ్చిందని తెలిపింది. దీనిపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అల్లు అర్జున్ తో డీజే, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించింది ఈమె. అయినా కూడా తన పేరు చెప్పకుండా ఇలా చెప్పడం ఏంటి అని వారు ఫీలవుతున్నారు.
తెలుగులో అత్యంత బిజీగా ఉన్న పూజ ఇలా అనవసర మాటలతో వివాదాలను కొనితెచ్చుకోవడం విచారకరం.