టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా అందులో పూజా హెగ్డే వుండి తీరాల్సిందే. ఆ స్థాయిలో క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇటీవల సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా చేస్తోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `జాన్` అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలోనూ నటిస్తోంది. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా ఎప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ అయి షూటింగ్స్ మొదలుపెట్టాలా అని పూజా ఎదురుచూస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో `ఈ క్వారెంటైన్ సమయాన్ని కలిసి గడిపే అవకాశం మీతో నటించిన హీరోల్లో ఒకరికి ఉందంటే అందుకు ఏ హీరోని ఎంచుకుంటారు? వారి ద్వారా ఏం నేర్చుకుంటారు? అని అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
ఇప్పటి వరకు తాను కలిసి నటించిన మహేష్బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, వరుణ్తేజ్, హృతిక్రోషన్, అక్షయ్కుమార్.. ప్రతిభావంతులే. కాబట్టి వారితో కలిసి క్వారెంటైన్ సమయాన్ని గడపాల్సి వస్తే అందరినీ క్వారెంటైన్లోకి తీసుకుని వారి నుంచి అనేక నైపుణ్యాలను నేర్చుకుంటానని చెప్పింది. ఇక హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తను తన కలల హీరో అని, అదృష్టం కొద్దీ అతనితో బాలీవుడ్లో తొలి సినిమా చేశానని, అనేక విషయాల్లో తను స్ఫూర్తిగా నిలుస్తుంటాడని, తనని స్వీయ నిర్భంధంలోకి తీసుకుంటే ఉదయం లేవగానే ఆయన అందాన్ని ఆస్వాదిస్తూ గడుపుతానని, వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో ఆయన నుంచి మెళకువలు నేర్చుకుంటానని వెల్లడించింది.