మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో దేశ వ్యాప్తంగా అన్ని పత్రికల్లో , ఛానళ్లలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రకటనల వరద కురుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద . ఫుల్ పేజీ అందునా కలర్ పేజీలు అలాగే ఫుల్ పేజీలతో పాటుగా మద్యమద్యలో చిన్న చిన్న ప్రకటనలు సైతం తెలుగు పత్రికల్లో భారీ మొత్తం చెల్లించి ఇస్తున్నారు .
అయితే చిన్నా చితకా పత్రికలకు కూడా ఇస్తున్నారు కానీ అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక అయిన ఈనాడు కు మాత్రం పెద్దగా ప్రకటనలు ఇవ్వడం లేదు .మరీ మొత్తంగా ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి అడపా దడపా ఈనాడు కు ప్రకటనలు ఇస్తున్నారు . ప్రకటనల కోసం వందల కోట్లని ఇస్తున్నారు . మోడీ హయాంలో భారత్ వెలిగిపోతోంది అంటూ భారీ ప్రకటనలు ఇస్తున్నారు , అలాగే ఛానల్ లలో కూడా . ఏప్రిల్ నుండి దేశ వ్యాప్తంగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి . మే నెలాఖరున కొత్త ప్రభుత్వం రానుంది దాంతో ఈ ప్రకటనలు .
English Title: PM Narendra modi mind blowing publicity in telugu dailies