Homeటాప్ స్టోరీస్దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు

దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు

People celebrate historic moment Scrapping of article 370 in Jammu and Kashmir
People celebrate historic moment Scrapping of article 370 in Jammu and Kashmir

దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు

ఆర్టికల్ 370 , ఆర్టికల్ 35 ఏ రద్దుతో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ సమస్య నానుతూనే ఉంది , అప్పటి నుండి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు దాంతో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370 రూపొందించారు . దాంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు .

- Advertisement -

జమ్మూ కశ్మీర్ ఎప్పటికి భారత్ లో అంతర్భాగమేనని నినదించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ కి మూల విరాట్టు అనే విషయం తెలిసిందే . దాంతో భారతీయ జనతా పార్టీ మొదటి నుండి ఆర్టికల్ 370 రద్దు పై పోరాటం చేస్తూనే ఉంది . ఎన్నికల హామీ లో ప్రతీసారి ఇస్తూనే ఉంది కానీ ఇన్నాళ్ల తర్వాత మోడీ – అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు . ఇక దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తల ఆనందోత్సాహానికి అంతేలేకుండా పోయింది . అయితే హైదరాబాద్ లో మాత్రం ర్యాలీ లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All