దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు
ఆర్టికల్ 370 , ఆర్టికల్ 35 ఏ రద్దుతో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ సమస్య నానుతూనే ఉంది , అప్పటి నుండి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు దాంతో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370 రూపొందించారు . దాంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు .
జమ్మూ కశ్మీర్ ఎప్పటికి భారత్ లో అంతర్భాగమేనని నినదించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ కి మూల విరాట్టు అనే విషయం తెలిసిందే . దాంతో భారతీయ జనతా పార్టీ మొదటి నుండి ఆర్టికల్ 370 రద్దు పై పోరాటం చేస్తూనే ఉంది . ఎన్నికల హామీ లో ప్రతీసారి ఇస్తూనే ఉంది కానీ ఇన్నాళ్ల తర్వాత మోడీ – అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు . ఇక దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తల ఆనందోత్సాహానికి అంతేలేకుండా పోయింది . అయితే హైదరాబాద్ లో మాత్రం ర్యాలీ లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం .