పవర్స్టార్ పవన్కల్యాణ్ దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత నటిస్తున్న `వకీల్సాబ్` చిత్రీకరిణ మొత్తానికి ఈ మంగళవారం పూర్తయింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత ఎనిమిది నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఇటీవలే మొదలైంది.
రాకెట్ స్పీడు వేగంతో ఈ మూవీ షూటింగ్ని పూర్తి చేశారు. ఇటీవల నిజాం కాలేజీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి సంబంధించిన కీలక సన్ని వేశాల్ని పవన్, శృతిహాసన్ పాల్గొనగా చిత్రీకరించింది చిత్ర బృందం. ఈ ఎపిసోడ్తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించి పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పేసింది.
నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి వస్తుందన్నదే అనుమానమే. కానీ వచ్చినా ఆశ్చర్యం లేదు. దిల్ రాజు మాత్రం విశ్వప్రయత్నాలే చేస్తున్నారు.