Homeటాప్ స్టోరీస్చంద్రబాబు కు వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

చంద్రబాబు కు వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

pawankalyan warns ap cm chandrababu naiduమీరు చెబుతున్న లెక్కలు కరెక్టా ? లేక భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెబుతున్న లెక్కలు సరైనవా ? వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి అప్పుడు అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది అంటూ చంద్రబాబు నాయుడి కి వార్నింగ్ ఇస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆంధప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని , విభజన హామీలను నెరవేర్చడం లేదని , నిధులు సమకూర్చడం లేదని తెలుగుదేశం ఆరోపిస్తుండగా , అదే రీతిలో బిజెపి కూడా ఎదురు దాడి చేస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన లెక్కలు అంటూ ఓ చిట్టా విప్పిన విషయం తెలిసిందే .

దాంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాడు . ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పవన్ కళ్యాణ్ జె ఏ సి ని ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు . ఇప్పటికే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ని అలాగే రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ తో చర్చలు జరిపాడు అనంతరం చంద్రబాబు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేసాడు . మరి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All