Homeఎక్స్ క్లూసివ్ఏబీఎన్ పై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్

ఏబీఎన్ పై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్

pawan kalyan twitter war on abn radhakrishnaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై ట్విట్టర్ వార్ మొదలు పెట్టాడు . ఇప్పటికే టివి 9 వాళ్ళని టార్గెట్ చేసిన పవన్ తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ పై అదేపనిగా ట్వీట్ లు చేయడం మొదలు పెట్టాడు . కేంద్ర ప్రభుత్వాన్ని , మోడీ ని తిట్టమని తెలుగుదేశం అధినేత కు చెప్పింది ఏబీఎన్ రాధాకృష్ణే అంటూ ట్వీట్ చేసాడు . అంతేకాదు వరుస ట్వీట్ లతో గుడ్ మార్నింగ్ కూడా చెబుతున్నాడు రాధాకృష్ణ కు .

తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచిన ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా మాకు వ్యతిరేకంగా వార్తలు రాశాయని అప్పట్లో మెగా కుటుంబం మొత్తం విరుచుకుపడిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడేమో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టివి 9 , మహా టివి , టివి 5 లు జనసేన కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని …… వాళ్ళు ఎంతగా టార్గెట్ చేసినప్పటికీ మా ఆత్మవిశ్వాసాన్ని వదిలేది లేదని అదే స్థాయిలో ఏబీఎన్ రాధాకృష్ణ పై వరుస ట్వీట్ లు చేస్తూ విరుచుకు పడుతున్నాడు పవన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All