జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది మీడియా . నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ కొన్ని ఛానళ్ల ని బాయ్ కాట్ చేయాలనీ ,వాటిని చూడొద్దని ట్వీట్ చేయడం …… కొంతమంది పవన్ అభిమానులం అని చెప్పుకునే వాళ్ళు ఏబీఎన్ వ్యాన్ పై దాడి చేయడంతో ఆగ్రహించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు . ఇంకా పార్టీ మొగ్గ దశలోనే ఉన్న ఈ సమయంలో మీడియాతో అనుకూలంగా ఉండాలి కానీ టార్గెట్ చేయడం ఏంటి ? అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు జర్నలిస్ట్ నాయకులు .
తక్షణమే క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ వార్తలను మీడియాలో రాకుండా చేస్తామని , త్వరలోనే మీడియా అధినేతలతో పాటుగా ఎడిటర్ ల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు . కొంతమంది ని పవన్ బ్యాన్ చేయాలనీ తన అభిమానులను కోరడంతో ఇంతటి వివాదానికి కారణం అయ్యింది . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీడియాకు టార్గెట్ అయ్యాడు . ఈ గోల ఎప్పుడు చల్లబడుతుందో ఏమో !