సినిమాలను వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అధికార తెలుగుదేశం పార్టీ నుండి ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసాడు అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు . ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మీడియాకు కోట్లాది రూపాయలు ఇచ్చారని , తెరవెనుక నుండి లోకేష్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు శ్రీనివాసరావు .
గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రకరకాల కథనాలు మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే . పైగా కొన్ని మీడియా సంస్థలు అయితే పవన్ పై చర్చలు పెట్టాయి దాంతో పవన్ కూడా వాటిని టార్గెట్ చేసిన విషయం కూడా విదితమే ! పవన్ కళ్యాణ్ కు ప్రజల మద్దతు ఉందని , మా సహాయ సహకారాలు అందిస్తామని ,పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరగరానిది జరిగితే దానికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరికలు జారీ చేసారు కాపునాడు నాయకులు .