తమ అభిమాన కథానాయకుడు వస్తున్నాడన్న సంతోషంలో భారీ ఎత్తున స్వాగతం పలకాలని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీ లను కడుతూ కరెంట్ షాక్ తో తిరిగిరాని లోకాలకు వెళ్లారు . అత్యంత విషాదకరమైన ఈ సంఘటన విశాఖపట్టణం లోని పాయకరావుపేటలో జరిగింది . జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ప్రజలతో మమేకం అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే శ్రీకాకుళం లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసాడు .
ఇక ఆ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం లోని పాయకరావు పేట కు వస్తుండటంతో 30 అడుగుల ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసారు అభిమానులు నాగరాజు , శివలు . అయితే ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో నాగరాజు తో పాటు శివ అక్కడికక్కడే చనిపోయారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది . అభిమాన నటుడు వస్తున్నాడన్న సంతోషం ఎక్కువసేపు లేకుండా పోయింది . తుని , పాయకరావుపేట లకు చెందిన ఇద్దరు అభిమానులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి .