రెండేళ్ల విరామం తరువాత పవర్స్టార్ పవన్ కల్యాణ్ బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కుతున్న `వకీల్ సాబ్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్తో కలిసి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరింది.
ఇందులో పవన్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ లీక్ అయిన విషయం తెలిసిందే. కరోనా తగ్గు ముకం పట్టిన తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు పవన్కల్యాణ్ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. మొఘలాయుల కాలం నాటి తెలంగాణ రాబిన్ హుడ్ కథతో ఈ మూవీని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు.
కోహినూర్ డైమెండ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక సెట్ల నిర్మాణం పూర్తయింది. ఇక షూటింగ్ స్టార్ట్ అనుకునే లోగా కరోనా ప్రబలడంతో షూటింగ్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి గత కొన్ని నెలలుగా `విరూపాక్ష` అనే టైటిల్ ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి బందిపోటు, మరొకటి `గజదొంగ`. ఈ రెండు టైటిల్స్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. ఇందులో మొఘల్ ప్రిన్సెస్గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుంది.