పవర్స్టార్ పవన్ కళ్యాణ్, ‘బాహుబలి’ స్టార్ రానా దగ్గుబాటి మల్టీస్టారర్ ఈ రోజు ప్రారంభం అవుతోంది. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనమ్ కోషియుం` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలతో పాటు ఈ చిత్రానికి స్క్రీన్ప్లేని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. `ది పవర్ స్టార్మ్ బిగిన్స్ టుడే.. వెరీ సూన్` అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తన ట్వీట్ చెప్పేశారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. `వకీల్ సాబ్` పూర్తి కాగానే తమ అభిమాన హీరో ఏకంగా రెండు భారీ చిత్రాల్ని ప్రారంభించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం ఈ రోజే అధికారికంగా ప్రకటించబోతోంది.