Homeటాప్ స్టోరీస్బన్నీకి పాన్ ఇండియా క్రేజ్

బన్నీకి పాన్ ఇండియా క్రేజ్

బన్నీకి పాన్ ఇండియా క్రేజ్
బన్నీకి పాన్ ఇండియా క్రేజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మొన్నటివరకు సౌత్ లో మాత్రమే వినిపించింది. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా రిలీజ్ అయ్యిందో బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. బన్నీ ఫాలోయింగ్ ఏకంగా దేశాలు దాటిపోయింది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఒక్కసారైనా బన్నీ సరసన నటించాలని హీరోయిన్స్ చాలా మంది ఎదురుచూస్తుంటారు. బన్నీతో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే..ఒక అమ్మడు మాత్రం వెరైటీగా రియాక్ట్ అయ్యిందట. నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా..? అని ఓ చిన్నదాన్ని బన్నీ అడగ్గా.. నువ్వు ముసలోడివి అయిపోతావ్ అని సమాధానం చెప్పిందట. దాంతో బన్నీ తెగ నవ్వుకున్నాడట.

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలిసినిమా గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించి మెప్పించింది కావ్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన కావ్య ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. కావ్య మసూద అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది కావ్య. గంగోత్రి సమయంలో కావ్యను ఆటపట్టిస్తూ బన్నీ.. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నీ డేట్స్ కావాలి అని అన్నారు.. దానికి నేను హీరోయిన్ అయ్యే సమయానికి మీరు ముసలోళ్లు అయిపోతారని అన్నానని కావ్య తెలిపింది.

- Advertisement -

దానికి బన్నీ నవ్వేశారు అని చెప్పింది. అయితే ఇప్పుడు బన్నీ సరసన ఛాన్స్ వస్తే ఈ అమ్మడు నో చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇటీవలే పలు యాడ్స్.. ఫ్యామిలీతో వెకేషన్ అంటూ బిజీ అయిన బన్నీ.. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా తన కూతురు అర్హతో కలిసి గణేష్ నిమజ్జనంలో సందడి చేశారు. జూబ్లీహిల్స్‏లో గీతా ఆర్ట్స్ సంస్థలో నెలకొల్పిన వినాయకుడికి సోమవారం వీడ్కోలు పలికారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా తన కూతురు అర్హతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గోన్నారు. అంతేకాకుండా.. ఇంట్లో అర్హ తయారు చేసిన వినాయక విగ్రహాలను సైతం తీసుకువచ్చారు. ఆ తర్వాత అర్హతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ ఊరేగింపుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All