భారత్ తో యుద్దానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ . కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోయినా నేను కాశ్మీరీల తరుపున అంబాసిడర్ గా మారతానని అంటున్నాడు ఇమ్రాన్ . ఆర్టికల్ 370 ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం దుస్సాహసానికి పూనుకుందని , కాశ్మీరీల కోసం భారత్ తో యుద్ధం చేయడానికి మా ఆర్మీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు .
ఆర్టికల్ 370 ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నాయకులు ఉక్రోషంతో రగిలిపోతున్నారు . అందుకే భారత్ తో యుద్దానికి సిద్ధం అంటూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు . అయితే పాకిస్థాన్ సత్తా ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు . జిహాదీ ముసుగులో భారత్ ని దెబ్బతీసే భారీ కుట్రకు పాల్పడుతున్నారు . ఇక రేపు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో దేశ వ్యాపారంగా హై అలెర్ట్ ప్రకటించింది భారత ప్రభుత్వం .