Homeఎక్స్ క్లూసివ్23 కోట్ల బిజినెస్ చేసిన శర్వానంద్

23 కోట్ల బిజినెస్ చేసిన శర్వానంద్

Padipadileche manasu pre release world wide business
sharwanand , sai pallavi

శర్వానంద్ – సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పడిపడి లేచె మనసు . ఈ సినిమా ఈనెల 21న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది . శర్వానంద్ కు తోడు సాయి పల్లవి కూడా తోడవ్వడంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది . శాటిలైట్ డిజిటల్ రైట్స్ కాకుండానే దాదాపు 23 కోట్ల బిజినెస్ జరిగింది పడిపడి లేచె మనసు చిత్రానికి . హను రాఘవపూడి లై సినిమాతో ఘోర పరాజయం పొందినప్పటికీ అది ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు బిజినెస్ కు .

శర్వానంద్ కు మంచి మార్కెట్ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 22కోట్ల 80 లక్షల బిజినెస్ జరిగింది , ఈ మొత్తానికి శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ అదనం . డిసెంబర్ 21న విడుదల అవుతున్న చిత్రాలలో పడిపడి లేచె మనసు చిత్రానికే మొగ్గు ఎక్కువగా ఉంది . తెలంగాణాలో 6 .30 కోట్లకు అమ్ముడు పోగా ఆంధ్రా  లో 9 కోట్లకు అమ్ముడు పోయింది , అలాగే రాయలసీమ 3 కోట్లు పలికింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ కలిపి నాలుగున్నర కోట్లు పలికింది . ప్రపంచ వ్యాప్తంగా 22. 80 కోట్లు బిజినెస్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -

English Title:Padipadileche manasu pre release world wide business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All