బిగ్ బాస్ కు వార్నింగ్ ఇస్తున్న ఓయూ స్టూడెంట్స్
తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ఓయూ స్టూడెంట్స్ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చారు . అసభ్యత , అశ్లీలత తో నిండి ఉండే బిగ్ బాస్ 3 ని అంగీకరించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు . తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే హీరో నాగార్జున ఇంటి తో పాటుగా షో నిర్వాహకుల ఇళ్లను ముట్టడిస్తామని సవాల్ విసిరారు . అసలే రకరకాల వివాదాలు చుట్టుకుంటున్నాయి బిగ్ బాస్ కు ఇక ఇప్పుడేమో ఓయూ స్టూడెంట్స్ కూడా వార్న్ చేయడంతో బిగ్ బాస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి .
యాంకర్ శ్వేతా రెడ్డి , నటి గాయత్రి గుప్తా తదితరులు బిగ్ బాస్ షో నిర్వాహకులపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే . బిగ్ బాస్ ఇష్యు పెద్దది కావడంతో హైకోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం . అయితే మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు . ఇక తదుపరి విచారణని ఈనెల 24 కు వాయిదావేసింది .