ఆది సాయి కుమార్, కార్తీక్ రాజు హీరోలుగా వినాయకుడు టాకీస్ బ్యానర్ పై సాయి కిరణ్ అడవి రూపొందిస్తున్న చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్.
ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది.
- Advertisement -
వినాయకుడు, కేరింత చిత్రాల దర్శకుడు సాయి కిరణ్ అడవి ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ స్వాతంత్రం దినోత్సవం సందర్బంగా విడుదల చేసారు.
యాక్షన్ ప్రధాన అంశంగా తలపిస్తున్న ఈ పోస్టర్ వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
బిజినెస్ పరంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తోంది.
వరస ప్లాపూలతో సతమతమవుతున్న ఆదికి ఈ చిత్రం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది..!
- Advertisement -