యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అక్క నందమూరి సుహాసిని కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నాడు . అది కూడా ఈనెల 27 నుండి 29 వరకు మూడు రోజుల పాటు కూకట్ పల్లి నియోజకవర్గం లో ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు . గతకొద్ది రోజులుగా ఎన్టీఆర్ టిడిపి తరుపున ప్రచారానికి రావడం లేదు అంటూ కథనాలు రావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది . దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని కలిసి ప్రచారం చేయనున్న విషయాన్నీ తెలియజేసాడట .
ఎన్టీఆర్ గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే . అయితే హరికృష్ణ మరణం తర్వాత నందమూరి – నారా కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . దాంతో హరికృష్ణ కూతురు సుహాసిని ని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీకి దింపాడు చంద్రబాబు . బాలయ్య కూడా సుహాసిని వెంట ఉండి నామినేషన్ వేయించాడు . ఇక సుహాసిని సోదరులుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తమవంతు బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది అందుకే ఈనెల 27 , 28 , 29 న మూడు రోజుల పాటు కూకట్ పల్లి లో ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసాడు ఎన్టీఆర్ . బాలయ్య బాబాయ్ తో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కూడా ఈ ప్రచార సభలలో పాల్గొననున్నారు .
English Title: NTR will be campaigning for suhasini from 27th