అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లి లో ఓటమి చెందడంతో ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసలే నాన్న చనిపోయిన బాధలో ఉన్న ఈ సమయంలో అక్క పోటీ చేయడం , దారుణంగా ఓడిపోవడంతో కుమిలిపోతున్నాడు ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కూడా . తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున కూకట్ పల్లి స్థానం నుండి పోటీ చేయించాడు చంద్రబాబు నాయుడు .
అయితే అక్క పోటీ చేయడం ఇష్టం లేదని ఎన్టీఆర్ తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా అన్నారట ! కానీ బాలయ్య బాబాయ్ తో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా పట్టుబట్టడంతో చేసేదిలేక నందమూరి సుహాసిని పోటీ చేసింది . ఎలాగూ కూకట్ పల్లి అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి గెలుస్తుందిలే అనుకున్నారు కానీ ఘోరంగా ఓడిపోవడంతో ఎన్టీఆర్ ఘోర అవమానంగా భావిస్తున్నాడట . ఎందుకంటే నాన్నకు తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగింది , దాన్ని మర్చిపోయిన సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధలో ఉన్నారంతా . ఇక ఇప్పుడేమో అక్క ఓటమి ఎన్టీఆర్ లో కసిని పెంచిందట.
English Title: NTR unhappy with kukatpally result