నందమూరి అభిమానులు ఎంతో హ్యాపీ గా ఉన్నారు. దీనికి ఒకటి ఆర్ఆర్ఆర్ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నదని , తాజాగా ఎన్టీఆర్ కుమారులను చూశామని..చాలామంది హీరోలు సోషల్ మీడియా లో తమ ఫ్యామిలీ పిక్స్ ను షేర్ చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చాల తక్కువ. అలాంటిది ఈరోజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ మరియు మరికొంతమంది బంధువులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీంతో తిరుమలలో మీడియా వీరిని ఫోటోలు, వీడియోలు తీసింది. ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఈ వీడియోలు, ఫోటోలలో ఉండటంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.
జూ.ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ సాంప్రదాయ దుస్తులలో కనిపించాడు. నుదిటిన విష్ణు నామం తీర్చిదిద్ది ఉంది. నెటిజనులు దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. భార్గవ్ కి అన్నీ ముత్తాత ఎన్టీఆర్ పోలికలే. భార్గవ రాముడే తారక రాముడు.. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ముఖాకృతి తనలో కనిపిస్తోంది. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే నంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.