వక్కంతం వంశీ మరోసారి డైరెక్టర్ గా మారారు. నితిన్ తో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబందించిన పూజా కార్య క్రమాలు ఆదివారం హైదరాబాద్ లో జరిగాయి. ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు రచయిగా పనిచేసి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ..ఇప్పుడు రెండోసారి డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాలో పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ వారితో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. కాగా, నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజిక వర్గం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.