‘చలో’ మూవీతో హిట్ సాధించిన టాలెంటెడ్ దర్శకుడు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా భీష్మ చిత్రం రూపొందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యస్.
నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిరంతరంగా జరుగుతోంది.
నితిన్ గత సినిమా ‘అ.. ఆ’ షూట్ చేసిన లొకేషన్లోనే ‘భీష్మ‘ షూటింగ్ జరుగుతోంది. ఆ లొకేషన్స్ లోనే ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.
ఆ సమయంలో అ.. ఆ జర్నీని నెమరు వేసుకుంటూ తలచుకొని ఏడ్చేశాడంట నితిన్. పైగా ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ”అ.. ఆ అదో అద్భుతమైన జర్నీ. అదే లొకేషన్ లో షూట్ చేస్తుండటంతో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఐ మిస్ యూ త్రివిక్రమ్ గారు” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నితిన్..!!