కరోనా కారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా మారింది. అలా అనుమతి లభించిన 50కి మించి వివాహ వేడుకలో బంధు మిత్రులు పాల్గొనే వీలు కుదరడం లేదు. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే చాలా మంది తమ పెళ్లిళ్లని వాయిదా వేసుకుంటున్నారు. ఇదే తరహాలో హీరో నితిన్ తన వివాహాన్ని మరో మూడు నాలుగు నెలలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న మరో యువ హీరో నిఖిల్ కూడా ఏప్రిల్ 16న జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల గుల్లో అయినా వివాహం చేసుకోవాలనుకున్నానని, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ తరహాలో వివాహం చేసుకోవడం ఇష్టం లేకే వాయిదా వేసుకున్నానని ప్రకటించిన నిఖిల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది.
ఇటీవల డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. తాజా పరిస్థితు, లాక్డౌన్ మళ్లీ పొడిగించడం వంటి కారణాలతో నిఖిల్ మనసు మార్చుకుని గురువారం సింపుల్గా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. తన ఫామ్ హౌస్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగనుందని తెలిసింది.