హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం బట్టబయలు అయ్యింది. బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై శనివారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహిచారు. సమాయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు దాడులు చేయగా..పబ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో పబ్లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకతో పబ్లోని యువతీ యువకులు డ్రగ్స్ను కిటికీ నుంచి కింద పడేశారు. పోలీసులకు పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడితో సహా పలువురు రాజకీయ, పోలీసుల కుమార్తెలు , కుమారులు ఉన్నట్లు తేలింది.
- Advertisement -