తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయిక నయనతార. పారితోషికం పరంగా దక్షిణాదిలోనే అత్యంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న నాయికగా రికార్డు సృష్టిస్తున్నారామె. తమిళంలో లేడీ సూపర్స్టార్గా పేరుతెచ్చుకున్న నయనతార ప్రస్తుతం వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే తన ప్రియుడు, యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. తరుచూ వార్తలో నిలుస్తున్న ఈ ప్రేమ జంట తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. హీరో శింబుతో తొలిసారి ప్రేమలో పడ్డ నయనతార ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయి ప్రభుదేవాతో ప్రేమలో పడింది.
అప్పట్లో తమిళ నాట సంచలనం సృష్టించిన వీరి ప్రేమకథకు మధ్యలోనే శుభం కార్డు పడింది. ప్రభుదేవా భార్య రమాలత్ మీడియా ముందుకు రావడం, తనకు ఆస్తిని రాసిచ్చి ప్రభుదేవా ఎవరిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో ప్రభుదేవా, నయనతారల ప్రేమాయణం దక్షిణాదిలోనే హాట్ టాపిక్గా మారింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ప్రభుదేవా తన మకాంని ముంబైకి మార్చేశాడు కూడా. అదే సమయంలో నయనతార సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. `శ్రీరామరాజ్యం` సెట్లో సినిమాలకు గుడ్బై చెబుతున్నందుకు భావోద్వేగానికిలోనై కన్నీళ్లు పెట్టుకుంది
అయితే ఆ తరువాత ప్రభుదేవా మారడం, పెళ్లికి ముందే ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో పెళ్లి దాకా వెళ్లకుండానే నయనతార, ప్రభుదేవా విడిపోయారు. ఆ తరువాత తీవ్ర మనస్థాపానికి గురైన నయనకు యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దగ్గరయ్యాడు. ఆమెని ఓదార్చి అండగా నిలవడంతో నయన మళ్లీ ప్రేమలోపడింది. వీరిద్దరు గత కొంత కాలంగా చెట్టపట్టాలేసుకుని దేశ విదేశాలన్నీ చుట్టొస్తున్నారు. ఇద్దరి విషయం ఇంట్లో వాళ్లకి కూడా నచ్చడంతో త్వరలో నయన, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ జంట తాజాగా గుళ్లు గోపురాలు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేస్తోంది. తాజాగా కన్యాకుమారిలోని భగవతి అమ్మన్, మురుగన్ టెంపుల్స్లో పట్టు వస్త్రాలు ధరించి నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి.