Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ నిర్మాతగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రకటన

త్రివిక్రమ్ నిర్మాతగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రకటన

naveen polishettys third film announced atlast
naveen polishettys third film announced atlast

జాతిరత్నాలు ద్వారా సూపర్ సక్సెస్ ను అందుకున్న నవీన్ పోలిశెట్టి మొత్తానికి తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు. జాతిరత్నాలు విడుదలైన ఆరు నెలల తర్వాత నవీన్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అన్నారు కానీ అది సాధ్యపడలేదు.

నవీన్ హీరోగా చేయనున్న మూడో చిత్రం ద్వారా కళ్యాణ్ శంకర్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. జాతి రత్నాలు సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసాడు కళ్యాణ్ శంకర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య కూడా నిర్మించనున్నారు.

- Advertisement -

ఇందుకోసం ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్ ను స్థాపించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది. అయితే నిర్మాతలు మాత్రం ఈ చిత్రంలో బలమైన కథతో పాటు మొత్తం ఫన్ ఉంటుందని అంచనాలు రేకెత్తించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All