చిత్ర నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ తన నివాసంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆమె పెంపుడు కుమారుడు వాసు తెలిపారు. ఆమె వయస్సు 58 సంవత్సరాలు. భర్త, కుమార్తె ఉన్నారు. జయశ్రీదేవి తొలుత పాత్రికేయురాలిగా కెరీర్ ప్రారంభించారు.
ఆ తర్వాత సినిమాల పట్ల ఆసక్తితో నిర్మాణవ్యవహారాలు చూసేవారు. కన్నడ పరిశ్రమలో దాదాపు 25 చిత్రాలు నిర్మించారు. తెలుగులో చిరంజీవితో ‘మంజునాథ’, కృష్ణతో ‘చంద్రవంశం’, ‘ఆదిశంకరాచార్య’ చిత్రాలు నిర్మించారు. కన్నడలో ‘నిశ్శబ్ద’, ‘నమ్ముర మందార హువే’, ‘హబ్బా’, ‘అమృతవర్షిణి’, ‘ముకుందా మురారి’ వంటి చిత్రాలు రూపొందించారు. తాజాగా ‘కురుక్షేత్ర’ సినిమా నిర్మాణం చేస్తున్నారు. జయశ్రీదేవి అంత్యక్రియలు బెంగళూరులో జరుగుతాయి.
English Title: nara jaya sridevi passes away