నేచురల్ స్టార్ నాని హీరోగా యమ బిజీగా వున్నారు. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన 28వ చిత్రాన్ని ఈ శుక్రవారం మైత్రీ మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించబోతున్నారు. మెంటల్ మదిలో, బ్రోచే వారెవరురా వంటి విభిన్నమైన చిత్రాల్ని అందించింది వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా కొత్త పంథాలో తెరపైకి తీసుకురానున్నారట.
ఈ మూవీకి సంబంధించిన టైటిల్ని చిత్ర బృందం ఈ నెల 21న ప్రకటించాలనుకున్నారు కానీ ఇప్పటికే టైటిల్ బయటికి వచ్చేసింది. ఈ మూవీకి `అంటే.. సుందరానికి..` అనే టైటిల్ని అనుకుంటున్నారట. ఇదే ఈ నెల 21న మేకర్స్ రివీల్ చేయబోతున్నారు. ఇందులో నానికి జోడీగా మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ నటించబోతోంది.
అయితే ఈ చిత్రానికి నాని రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా అడల్ట్ కంటెంట్ని యాడ్ చేస్తున్నారట. అయితే అది శృతిమించకుండా వుంటుందని చెబుతున్నారు. నాని క్యారెక్టర్ ఈ చిత్రంలో సరికొత్తగా వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే సెట్స్పైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని మేకర్స్ ఈ నెల 21న ప్రకటించబోతున్నారు.