Homeటాప్ స్టోరీస్సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!

సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!

సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!
సవారి.. రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటున్నారు!

నందు హీరోగా గుర్రం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సవారి. ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. డీసెంట్ రివ్యూలను తెచ్చుకుంది. కొన్ని నెగటివ్ అంశాలు ఉన్నప్పటికీ గుర్రం సెంటిమెంట్ ను చక్కగా వాడుకుంటూ, బి, సి సెంటర్లకు మంచి మాస్ విందును అందించారని క్రిటిక్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకు జనాల నుండి కూడా స్పందన బాగుంది. మెయిన్ గా పాటలు సూపర్ హిట్ అవ్వడంతో కలెక్షన్స్ పై అది ప్రభావం చూపించింది. మొదటిరోజు ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి. రెండో రోజు కూడా డీసెంట్ హోల్డ్ మైంటైన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సవారీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏరియాల వారీగా బ్రేక్ డౌన్ నంబర్లు ఇవ్వలేదు కానీ తమ చిత్రం బ్రేక్ ఈవెన్ కు మాత్రం చేరుకుందని ప్రకటించారు. అంటే ఇక ఆదివారం అయిన ఈరోజు నుండి బయ్యర్లకు లాభాలు మొదలుకానున్నాయన్నమాట.

నిజానికి సవారి చాలా తక్కువ బడ్జెట్ లోనే కానిచ్చేశారు. అలాగే టేబుల్ ప్రాఫిట్స్ తో బయ్యర్లకు అమ్మేసారు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ కావడం, అలాగే ట్రైలర్ కూడా జనాల నుండి మంచి స్పందన తెచ్చుకోవడంతో సవారి మార్కెట్ లో మంచి రేట్లకే అమ్ముడుపోయింది. దీనికి తోడు డిజిటల్ హక్కులు, సాటిలైట్ హక్కులు కలుపుకుని సవారి నిర్మాతకు లాభాలు పంట పండించినట్లే.

- Advertisement -

నందు సరసన ప్రియాంక శర్మ నటించిన ఈ చిత్రంలో బాద్షా పాత్ర పోషించిన గుర్రంది మరో మెయిన్ క్యారెక్టర్. ఇందులో నంది సవారి చేసే యువకుడిగా కనిపిస్తాడు. అదే తన జీవనాధారం. అయితే బాద్షాకు గుండెలో ప్రాబ్లెమ్ ఉందని తెలుస్తుంది. దానికి బోలెడంత డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో నందు ఏం చేసాడు? దానివల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్న కోణంలో సినిమా సాగుతుంది. సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All